My Blog List

Wednesday, August 17, 2011


ఆజాద్ ' నేతాజీ

సుమారు రెండు వందల సంవత్సరాల పరాయి పాలన దుష్ఫలితాలు మన 

మనసులనుంచి అప్పుడే చెరిగిపోవు. చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది 
కాదన్నారు రమణ. 

అలాగే ఇంత దుర్భరమైన... దాస్య శృంఖలాలలో మ్రగ్గిపోయిన బతుకులు అంత 
తొందరగా తెప్పరిల్లవు. ఆ మరకలు అంత తొందరగా చెరిగిపోవు. 

తరాలు మారుతున్నా ఆ కన్నీటి గాథల్ని, దుర్భర నరకాన్ని ఇప్పటికీ ఇంకా 
తలచుకుంటూనే వుంది మన జాతి. 65 ఏళ్ళు గడిచిపోతున్నా స్వాతంత్ర్య ఫలాన్ని
 అందించిన మహానుభావుల్ని మరచిపోలేదు ఈ దేశం. 

ఎందరెందరు... ఎన్ని త్యాగాలు... ఎన్నెన్ని పంథాలు... అవి చెప్పుకుంటే తరిగేవి 
కావు.ఏ దారిన వెళ్ళినా అందరి లక్ష్యం ఒక్కటే ! మన జాతి స్వతంత్ర్యంగా 
జీవించాలి.పరాయివాళ్ళ తొత్తులు కాకూడదు. మన ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలి.
ఇదీ అప్పటి మహనీయుల ఆశయం. 


అలాంటి మహానుభావుల్లో అగ్రగణ్యులుగా 
పేరు తెచ్చుకున్నవారిలో ప్రముఖులు
నేతాజీ సుభాస్ చంద్ర బోస్. బ్రిటిష్ వారి 
మీద తిరుగుబాటుకోసం స్వంతంగా సైన్యాన్నే 
నిర్మించిన ధీశాలి.ఎన్నో కష్టనష్టాలు భరించారు. 
తన నిండు జీవితాన్ని దేశంకోసం బలి చేసారు. 

No comments: